GDWL: ప్రతి పదేళ్లకోసారి జరిగే జనగణన దేశాభివృద్ధికి దిక్సూచి వంటిది, ఈసారి పూర్తి డిజిటల్ పద్ధతిలో జరిగే ఖచ్చితమైన లెక్కలు తేలుతాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష అనారు. బుధవారం గద్వాల ఐడీఓసీలో జిల్లాస్థాయి చార్జ్ అధికారులకు మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. 2026లో ఇళ్ల గణన, 27లో జనాభా గణన ప్రక్రియలు ఉంటాయన్నారు.