KDP: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి షరీఫ్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రొద్దుటూరు డిప్యూటీ తహశీల్దార్ సుదర్శన్కు గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీల వారు గ్యాస్ సిలిండర్లను ప్రజలకు కాకుండా వ్యాపారులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.