WG: ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరమని నరసాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పొత్తూరి రామరాజు పేర్కొన్నారు. బుధవారం నరసాపురం పార్టీ కార్యాలయంలో 28 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షల విలువైన సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే తమ లక్ష్యమని తెలిపారు