CTR: సదుం పంచాయతీ వనరుల బహిరంగ వేలం బుధవారం నిర్వహించారు. ఇందులో వారపు సంతను రూ. 16.30 లక్షలకు మనోజ్ కుమార్ దక్కించుకున్నారు. దినసరి మార్కెట్ రూ. 60,500, ప్రైవేటు బస్టాండు రూ. 68 వేలు, పూలమార్కెట్ రూ. 73,500, జంతువధ శాల రూ. 4 వేలకు వేలం పలికాయి. గతేడాది కంటే సుమారు రూ. 6 లక్షల అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.