WGL: పట్టణ కేంద్రంలోని LB నగర్ క్రిస్టల్ గార్డెన్లో బుధవారం సాయంత్రం కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ‘ఈద్ కా తోఫా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. పండుగలను సోదరభావంతో, ఐక్యతతో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.