KNR: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా సైదాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాస్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. మహిళలకు రూ. 2500, రూ. 500కే గ్యాస్, రూ. 4వేల పెన్షన్, యువ వికాసం అమలు చేయకుండా సీఎం రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని మండల అధ్యక్షుడు దెంచనాల శ్రీనివాస్ మండిపడ్డారు. రైతులను దగా చేశారని, వెంటనే హామీలు అమలు చేయాలని కోరారు.