WNP: తెలుగు నూతన సంవత్సర ఉగాది(పరాభవ నామ సంవత్సర) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సుభిక్షం నిండాలని ఆకాంక్షించారు. ఆమె మాట్లాడుతూ పండుగ సందర్భాల్లో అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.