GNTR: సహస్ర లింగేశ్వరస్వామి, వీరాంజనేయస్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో అమర్నాథ్ తెలిపారు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ఉచితంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. భక్తులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.