NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో బుధవారం వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ ఛైర్పర్సన్ పున్న శైలజ పాల్గొన్నారు. ప్రిన్సిపల్, ప్రొఫెసర్ రమావత్ రవి మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి వెళ్ళిన విద్యార్థులంతా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్కు ఘనంగా సన్మానం చేశారు.