కృష్ణా జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు తమ స్వగ్రామాల బాట పట్టారు. గూడవల్లి, నిడమానూరు, కానూరు, పెనమలూరు, గంగూరు తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు సామాన్లు సర్దుకుని ఇళ్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి.