MBNR: కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిదవ డివిజన్ క్రిస్టియన్ పల్లి ఆదర్శనగర్ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా డివిజన్లో నెలకొన్న సమస్యలను గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ పారిశుద్ధ్యం రోడ్లు వీధి బల్బుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకూడదని సిబ్బందిని ఆదేశించారు.