SKLM: జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే, పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.