HYD: తాండూరు మాజీ MLA రోహిత్ రెడ్డి వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. 2018 నుంచి డ్రగ్స్ కేసు, ఎమ్మెల్యేల ఎర కేసు, పోలీసులతో గొడవలు వంటి అనేక ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. తాజాగా మున్సిపల్ ఎన్నికల సమయంలో పోలీసులతో గొడవ పడి, వారంపాటు అజ్ఞాతంలో ఉండి బెయిల్ పొందారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి సోమవారం తాండూరు పోలీస్ స్టేషన్లో హాజరవుతున్నారు.