విశాఖలో భూ ఆక్రమణలు పెరుగుతున్నాయని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి అవినీతిని ప్రజలకు తెలియజేయాలని, నగరాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్లకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు.