GNTR: ఫిరంగిపురం మండలంలోని ఫిరంగిపురం, రేపూడి గ్రామాల్లో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వాసంతి మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బిందు, తుంపర సేద్యానికి 90 శాతం వరకు రాయితీలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో గ్రామస్తులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.