VKB: యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, కొడంగల్ 7వ వార్డు కౌన్సిలర్ యం.కృష్ణంరాజు ఆలయ నిర్మాణానికి విరాళం అందించారు. కొడంగల్ మండలం ఉడిమేశ్వరం గ్రామంలో సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూ. 25 వేల చెక్కును మైసమ్మ ఆలయ నిర్మాణం కోసం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్థులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.