SDPT: జిల్లాలో గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 1070 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేటలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను రద్దు చేసి సిద్దిపేట ప్రజలను వంచించడం తగదన్నారు.