NLG: దేవరకొండలోని గ్రంథాలయంలో గురువారం తెలంగాణ సాహిత్య సాంస్కృతిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ‘ఉగాది కవి సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు పర్చా వాసుదేవరావు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని కవులు, రచయితలు, సాహితీ అభిమానులు, కళాకారులు హాజరు కావాలని కోరారు.