E.G: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని దివ్యాంగులు అన్ని రంగాలలోనూ రాణించాలని MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆకాంక్షించారు. బుధవారం రాజమండ్రి రూరల్ MPDO కార్యాలయం వద్ద ‘దివ్యాంగ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు.