NDL: నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభం సపోర్ట్ తీగకు తగలడంతో స్తంభం విరిగి బస్సుపై పడింది. అదృష్టవశాత్తు విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటనపై విద్యుత్ శాఖ ఏఈ కంబగిరి పరిశీలించారు.