JN: తెలంగాణ సాయుధ పోరాటంలో సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరన్పల్లి గ్రామ ప్రజలు చూపిన ధైర్యసాహసాలను గౌరవిస్తూ ఆ గ్రామానికి ‘వీర బైరాన్పల్లి’గా నామకరణం చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు, MLA పల్లా వినతిపత్రం అందజేశారు. ప్రాణాలతో బయటపడిన వారికి ఆర్థిక సహాయం అందించాలన్నారు.