KMR: రన్నింగ్ కారులో మంటలు వ్యాపించి కారు తగలబడిన ఘటన మాచారెడ్డి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి-సిరిసిల్ల రోడ్డుపై రన్నింగ్లో ఉన్న సీఎన్జీ కారులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్ కారును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఈ క్రమంలో మంటలు ఎక్కువై కారు పూర్తిగా దగ్ధమైంది.