PDPL: పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు.