ప్రకాశం: కనిగిరిలోని ఆర్టీసీ డిపోలో దివ్యాంగులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం ప్రారంభించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం లాగానే దివ్యాంగులకు కూడా ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.