సత్యసాయి: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరుల స్థాపన కోసం కేటాయించిన భూముల పురోగతిపై జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్షించారు. ఏపీఐఐసీ, నెడ్క్యాప్ సంస్థలకు నిర్దేశించిన గడువులోగా భూములను అప్పగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూసేకరణలోని అడ్డంకులు తొలగించి, సరిహద్దుల గుర్తింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.