TG: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారంపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. 2028లో ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, 2029లోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఢిల్లీలో చిట్చాట్లో మాట్లాడుతూ.. రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తే అది ఆహ్వానించదగ్గ పరిణామమేనని అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ విషయంలో వస్తున్న ఊహాగానాలకు తన వ్యాఖ్యలతో సీఎం తెరదించారు.