NRPT: మరికల్ మండలంలో భారతదేశపు అతిపెద్ద క్రీడా వేడుకగా భావించే భారత ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలను ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కరపత్రాలను ఆవిష్కరించారు. క్రీడాకారులు మార్చి 24వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.