MDK: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో తై బజార్ వేలంపాటలో రూ. 43.35 లక్షల ఆదాయం సమకూరింది. కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వేలంపాటలు నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన నాగరాజు వేలం పాటల్లో తై బజార్ దక్కించుకున్నారు. గత ఏడాది కంటే రూ. 7.35 లక్షల ఆదాయం అధికంగా సమకూరిందని తెలిపారు.