MLG: జిల్లా కేంద్రంలో ఇవాళ గోండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ మీడియాతో మాట్లాడారు. జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇసుక డి-సెల్టింగ్ విధానాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల వెంకటాపురం మండలంలోని ఆదివాసి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.