BPT: కర్లపాలెం మండలం ఎట్రావారిపాలెం గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎంపీడీవో అద్దురి శ్రీనివాసరావు పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై సిబ్బందితో సమీక్షించారు. పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ అభివృద్ధికి ఈ పనులు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.