NTR: పెనుగంచిప్రోలులోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఆస్తులు నిట్టనిలువునా తుప్పు పట్టిపోతున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించాల్సిన ఇనుప చువ్వలను ఏళ్ల తరబడి ఆరుబయట వదిలేయడంతో అవి పనికిరాకుండా పోతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.