E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరంలో ఉన్న గ్యాస్ కంపెనీ వద్ద వినియోగదారులు బుధవారం పడిగాపులు కాస్తున్నారు. బుకింగ్ చేసుకున్నప్పటికీ సిలిండర్లు సకాలంలో ఇంటికి చేరకపోవడంతో ప్రజలు ఏజెన్సీ కార్యాలయానికి వచ్చారు. మరో పక్క గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే సంబంధిత కంపెనీ హెల్ప్లైన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.