NDL: బనగానపల్లె (M) నందవరంలో చౌడేశ్వరి మాతకు బుధవారం చతుర్దశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని పసుపు పారాయణంతో అలంకరించారు. వేద పండితులు కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహామంగళహారతి నిర్వహించారు. చతుర్దశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.