ADB: గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు పోషకాహార భద్రత కల్పించే లక్ష్యంతో ఉచిత కూరగాయల మినీ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నేరడిగొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ బ్లాక్ ఆత్మ (ATMA) ఛైర్మన్ గొర్ల రాజు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కూరగాయల కిట్లను పంపిణీ చేశారు. ప్రజలు స్వయంగా కూరగాయలు సాగు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.