SRD: నారాయణఖేడ్ పట్టణంలోని బస్తీ దవాఖానను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలోని హాజరు, మందుల రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.