ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాలం మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ఓ భవనంలో మంటలు చెలరేగాయి. అందులో పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనంలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉన్నాయి. ఘటనాస్థలానికి ఫైరింజన్లు, అంబులెన్సులు చేరుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.