BDK: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ శాసనసభ ఆవరణంలో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరయ్యారు. ఈ సభలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రాధాన్యతలపై ఈ సమావేశంలో చర్చించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.