NLG: మాడుగులపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చెరువుపల్లి గ్రామానికి చెందిన పాలువాయి సుమలతతో పాటు మరో ఇద్దరు మహిళలకు తహసీల్దార్ సామల సరోజ పావని చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి పాల్గొన్నారు.