PLD: పశుసంవర్ధక శాఖ సిబ్బంది పశువులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు తెలిపారు. శావల్యాపురం మండలం కొత్తలూరులో పశుసంవర్ధకశాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను మంగళవారం ఆయన పరిశీలించారు. వెటర్నరీ డాక్టర్లు గణేశ్, కావ్యలతో కలిసి గాలికుంటు టీకాల గోడపత్రికలు ఆవిష్కరించారు. అనంతరం పశువులకు టీకాలు వేశారు.