MNCL: జన్నారం మండలంలోని మందపల్లి రేండ్లగూడలో నిర్వహించే పశువుల సంత వేలంపాటను వాయిదా వేశామని గ్రామ సర్పంచ్ అల్లం మాధవి-రవి, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రేండ్లగూడ పంచాయతీ కార్యాలయంలో పశువుల వారసంత వేలం పాటను నిర్వహించారు. అయితే సరైన డిపాజిట్ రాకపోవడంతో వేలంపాటను శుక్రవారానికి వాయిదా వేశామన్నారు. ఈ మేరకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.