SRCL: రాజీమార్గమే రాజ మార్గమని సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పుష్పలత అన్నారు. సిరిసిల్లలోని కోర్టులో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో మంగళవారం జరిగిన సమన్వయ సమావేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కారం అవడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ నుంచి విముక్తి పొందుతారని తెలిపారు.