NDL: బనగానపల్లి మండలం పెద్దరాజు పల్లి గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో రూ. 25 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కంటే కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి అన్నారు.