TG: రాష్ట్ర విద్యా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇవాళ యూకే ప్రతినిధి బృందం పర్యటనలో భాగంగా HYDలో 13 అత్యాధునిక పాఠశాలల ఏర్పాటుపై స్పష్టత రానుంది. ఉన్నతాధికారులతో జరిగే ఈ భేటీలో పాఠశాలల నిర్వహణ, విద్యా ప్రమాణాలపై చర్చించనున్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యను భాగ్యనగర విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ బృందం రాక ప్రాధాన్యత సంతరించుకుంది.