NGKL: అచ్చంపేటకు చెందిన ప్రజా సంఘాల నాయకులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుని, వారికి బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని కోరారు. హైదరాబాద్లో బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి డీజీపీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకులపై ఉన్న కేసుల వల్ల వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు.