కాకినాడ: నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ప్రత్తిపాడు మండలం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వొమ్మంగి శ్రీ భారతి విద్యాసంస్థకు చెందిన కాశీ బెహన్ మోహెల్ (ఎటపాక), చేవల కృపామయి, ముమ్మిడి పవన్ (పెద్దాపురం) నవోదయాలకు ఎంపికయ్యారు. అలాగే అఖిల్ స్కూల్ విద్యార్థి చేవల ప్రమోద్ పెద్దాపురం నవోదయకు ఎంపికైనట్లు పాఠశాలల నిర్వాహకులు తెలిపారు.