SDPT: అకాల గాలి దుమారంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తోగుట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు. వెంకటరావుపేటలో మొక్కజొన్న చేలు నేలకూలి, మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించాలని కోరారు.