ADB: ఉట్నూర్ మండలంలోని లింగోజి తండా ఎక్స్ రోడ్ వద్ద ‘పీఎం స్వనిధి 2.0’ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదిలాబాద్ ఎల్డీఎం ఉత్పల్ మాట్లాడుతూ.. వీధి వ్యాపారులు ఎస్బీఐ ద్వారా అందించే రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. తక్కువ వడ్డీతో లభించే ఈ రుణాలతో వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని కోరారు.