మఠంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న సమాచార హక్కు రక్షణ చట్టం 2005, 5వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ పిలుపునిచ్చారు. మంగళవారం మఠంపల్లి కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ పోస్టల్ ఆవిష్కరణను స్థానిక నాయకుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.