కృష్ణా: ఇంటర్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాసుకుని నేరుగా ఇళ్లకు చేరాలని ఉయ్యూరు CI రామారావు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. అల్లరి చర్యల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం పటిష్ట నిఘా, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టామన్నారు.