PDPL: ధర్మారం శివారులో కిషన్ రావు పేటకు చెందిన గుమ్మడి వెంకటేష్ (37) నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. KNR ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. కాగా, వెంకటేష్ దుబాయ్ వెళ్లి తాగుడుకు బానిసయ్యాడని, అప్పులు పెరగడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.